Kakinada: వారాహి యాత్రపై వైసీపీ సర్కార్ టార్గెట్
ABN, First Publish Date - 2023-06-11T08:12:46+05:30
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై వైసీపీ సర్కార్ టార్గెట్ చేసింది. యాత్ర లక్ష్యంగా కాకినాడ.. కోనసీమ జిల్లాలో జగన్ సర్కార్ పోలీసు ఆంక్షలు విధించింది.
కాకినాడ: జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రపై వైసీపీ సర్కార్ (YCP Govt.) టార్గెట్ (Targer) చేసింది. యాత్ర లక్ష్యంగా కాకినాడ.. కోనసీమ జిల్లాలో జగన్ సర్కార్ పోలీసు ఆంక్షలు విధించింది. అకస్మాత్తుగా పెద్దాపురం, అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపడానికి వీల్లేదని పోలీస్ శాఖ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయ్యే అన్నవరం నుంచి కోనసీమ జిల్లా అమలాపురం వరకు ఆంక్షలు వర్తిస్తాయని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేసింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వారాహి యాత్రను టార్గెట్ చేసి.. పోలీసులు ఆంక్షలు విధించినట్లు జనసేన నేతలు ఆరోపించారు.
Updated Date - 2023-06-11T08:12:46+05:30 IST