ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirupati Dist.: గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి

ABN, First Publish Date - 2023-11-20T09:00:08+05:30

తిరుపతి జిల్లా: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‍ భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరు ఉత్కంఠను రేపింది. దీన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు.

తిరుపతి జిల్లా: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‍ (Cricket World Cup Final Match) భారత్ (India)- ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరు ఉత్కంఠను రేపింది. దీన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతి రూరల్ మండలంలోని దుర్గసముద్రానికి చెందిన టీటీడీ రిటైర్టు అటెండరు మండ్యం సుధాకర్ కుమారుడు జ్యోతికుమార్ యాదవ్ (32) ఎంసీఏ చదువుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం (Software Job) చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం (Work from Home) పద్ధతిలో పనిచేస్తున్నాడు. జ్యోతి కుమార్ యాదవ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉండటంతో ఇంట్లోనే స్నేహితులతో కలిసి భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఈ మ్యాచ్ రేపిన ఉత్కంఠ వల్ల ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. స్నేహితులు, కుటుంబీకులు వెంటనే చికిత్స కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో దుర్గసముద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి సమాచారం తెలయాల్సి ఉంది.

Updated Date - 2023-11-20T09:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising