Home » Cricket World Cup
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్-పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని హర్మన్ రివీల్ చేసింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.
47 ఏళ్ల తర్వాత టీమిండియా మహిళలు వన్డే ప్రపంచ కప్ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంతో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
క్రికెట్ చరిత్రలో ముంబై వేదికగా ఎన్నో చారిత్రాత్మకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 2011 ప్రపంచ కప్ నుంచి ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ వరకు ఎన్నో మరువలేని జ్ఞాపకాలు, గుర్తులు ఉన్నాయి.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచకప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
టీమిండియా ప్లేయర్లు అందరూ తమ సంబరాల్లో మునిగి ఉంటే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం గురుభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్కు పాదాభివందనం చేసింది.
ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 299 పరుగులు లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్దేశించింది. అప్పటికే ఫామ్లో ఉన్న సఫారీ సేనకు ఇది పెద్ద కష్టమేమీ కాదనే భావించారంతా. కానీ.. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఓ నిర్ణయమే తమ కొంప ముంచిందని సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ వెల్లడించింది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి.. విశ్వ విజేతగా భారత్ నిలిచింది. ఈ అపూర్వ విజయంలో షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది . అనూహ్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షఫాలి వర్మ.. తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంది.