ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu Desam Party: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్

ABN, First Publish Date - 2023-10-02T19:38:21+05:30

అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు.

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు తొలుత ప్రయత్నించారు. అయితే బండారు సత్యనారాయణ మూర్తి తన ఇంటి తలుపులు తెరవకపోవడంతో పోలీసులు హడావిడి చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో వారిని చెదరగొట్టారు. చివరకు టీడీపీ నేత ఇంటి తలుపులు బద్దలు కొట్టి నోటీసులు అందజేశారు. 41ఏ, 41బీ సెక్షన్ల కింద నోటీసులు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: చిన్నప్పటి నుంచి జగన్‌ని చూస్తున్నాను

కాగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని.. పోరాటాన్ని కొనసాగించాలని లోకేష్ చెప్పారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ తొత్తుల్లా వ్యవహరించే ప్రతి అధికారి వివరాలు నమోదు చేయాలని బండారు సత్యనారాయణమూర్తికి సూచించారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా కక్ష సాధింపులకు దిగడం కొందరు పోలీసులకు పరిపాటిగా మారిందని లోకేష్ మండిపడ్డారు. బూతుల మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను నిలదీశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన పోరాటం ఆపేది లేదని లోకేష్‌కు బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-10-02T20:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising