AP News: ఏపీలో దారుణాలు కలవరపెడుతున్నాయి: మందకృష్ణ మాదిగ
ABN, First Publish Date - 2023-05-21T17:16:13+05:30
ఏపీ (AP)లో దళితుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ (Manda Krishna Madiga) మాదిగ అన్నారు.
అమరావతి: ఏపీ (AP)లో దళితుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ (Manda Krishna Madiga) మాదిగ అన్నారు. ప్రశ్నించడమే ఏపీలో నేరంగా మారిందన్నారు. జడ్జీల్నే జైళ్లల్లో పెట్టే పరిస్థితి ఏపీలో వచ్చిందని మండిపడ్డారు. ఏపీలో జరుగుతోన్న దారుణాలు కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బాధితుల కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ అచ్చెన్న మరణంలో ఇదే జరిగిందన్నారు. అనుమానితుల పేర్లను బాధిత దళితులు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దళితులు హత్యకు గురవుతున్నా.. హత్య కేసు నమోదు కావడం లేదన్నారు. ఏపీలో దళితులు మాడిమసై పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-21T17:16:13+05:30 IST