ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి
ABN, First Publish Date - 2023-11-06T09:44:56+05:30
బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
అనంతపురం : బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు కిందపడి అక్కడికక్కడే భార్యాభర్తలైన రామాంజనేయులు (35) అనిత (27) అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సుని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-11-06T09:44:57+05:30 IST