NVSS Prabhakar: ఇంట్లో పోరు భరించలేకనే కేసీఆర్ కొత్త డ్రామా
ABN, First Publish Date - 2022-12-10T12:38:27+05:30
దేశం అంతా కేసీఆర్ కుటుంబ పాలనను చూసిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
కరీంనగర్: దేశం అంతా కేసీఆర్ కుటుంబ పాలనను చూసిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (BJP Leader NVSS Prabhakar) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇంట్లో పోరు భరించలేకనే కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. కేసీఆర్ ది ఇప్పుడు కిసాన్ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ (Telangana CM KCR) ది అక్రమాల సర్కార్, దోపిడీ సర్కార్ అని వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. తెలంగాణను ఉద్ధరించింది ఏంటి అని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు దేశానికి ఏం చేస్తారని నిలదీశారు. రైతు రుణమాఫీ ఏదీ కేసీఆర్ అని ప్రశ్నించారు. కోటి కుటుంబాల తెలంగాణను ఒకే కుటుంబం పాలిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-12-10T12:38:32+05:30 IST