T20 World Cup: పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మ్యాచ్ను అడ్డుకున్న వర్షం
ABN, First Publish Date - 2022-11-03T16:44:57+05:30
టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న కీలక పోరుకు వరుణుడు అడ్డు పడ్డాడు. పాకిస్థాన్ (Pakistan) నిర్దేశించిన
సిడ్నీ: టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న కీలక పోరుకు వరుణుడు అడ్డు పడ్డాడు. పాకిస్థాన్ (Pakistan) నిర్దేశించిన 186 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా(South Africa)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 16 పరుగులకే క్వింటన్ డికాక్ (0), రిలీ రోసౌ (7) అవుటయ్యారు. అయితే, కెప్టెన్ తెంబా బవుమా, మార్కరమ్ కలిసి పాక్ బౌలర్లను కాసేపు అడ్డుకున్నారు. దీంతో పరుగులు రావడం ప్రారంభమైంది. ఇద్దరూ క్రీజులో పాతుకుపోతున్న సమయంలో సఫారీలకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది. 65 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో తెంబా బవుమా అవుటయ్యాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో 36 పరుగులు చేసి బవుమాను షాదాబ్ ఖాన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 66 పరుగుల వద్ద మార్కరమ్ (20)ను అవుట్ చేశాడు. దీంతో 64 పరుగులకే సౌతాఫ్రికా నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. హెన్రిక్ క్లాసెన్ (2), స్టబ్స్ (2) క్రీజులో ఉన్నారు.
Updated Date - 2022-11-03T16:44:59+05:30 IST