Home » T20 WORLD CUP
మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో హర్మన్ సేన.. భీకర ఆస్ట్రేలియాతో తలపడనుంది. లార్డ్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.
భారత్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించారు. అంతేకాక టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి రికార్డును దీప్తి శర్మ సమం చేసింది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎడ్జ్బాస్టన్ వేదికగా రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు పాక్ టీమ్కు భారీ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు గాయమైంది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ఇప్పటికే మొదలైంది. ఆదివారం టీమిండియా తన తొలి మ్యాచ్ను బర్మింగ్హామ్ వేదికగా పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మరికొద్ది రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే నాటి పరిస్థితులపై బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిటన్ దాస్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం గురించి వెల్లడించింది. లార్డ్స్ మైదానంలో టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
మహిళల క్రికెట్ చరిత్రలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 5 వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది.