ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రైల్వే స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా షాకింగ్ ఘటన.. కరెంట్ వైర్ మీద పడడంతో..

ABN, First Publish Date - 2022-12-09T20:19:54+05:30

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్‌ఫామ్‌పై మరో వ్యక్తితో మాట్లాడుతున్న టీటీఈ (Ticket Collector)పై హైటెన్షన్ వైర్ తెగి పడింది. దీంతో ఆ టీటీఈ రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో (Khragpur Railway Station) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్‌ఫామ్‌పై మరో వ్యక్తితో మాట్లాడుతున్న టీటీఈ (Ticket Collector)పై హైటెన్షన్ వైర్ (Live Wire) తెగి పడింది. దీంతో ఆ టీటీఈ రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

టీటీఈగా పని చేస్తున్న సుజన్ సింగ్ సర్దార్‌ అనే వ్యక్తి ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తన సహోద్యోగితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా హైటెన్షన్ వైర్ తెగి అతడిపై పడింది. వెంటనే అతను స్పృహ కోల్పోయి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. పట్టాలపై పడిపోయిన సుజన్‌ను రైల్వే సిబ్బంది వెంటనే ఖరగ్‌పూర్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. సుజన్ తలతోపాటు ఆయన శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Updated Date - 2022-12-09T20:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising