Home » Indian Railways
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
మొంథా తుపాన్ నేపథ్యంలో 43 ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. అయితే పలు రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించింది.
అమృత్సర్-సహర్సా ఎక్స్ప్రెస్ రైల్లోని ఓ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగా బోగీ మొత్తం దగ్ధమైపోయింది. శనివారం శిర్హింద్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. పొగలు మొదలైన వెంటనే గుర్తించిన అధికారులు ప్రభావిత కోచ్లోని ప్రయాణికులను ఇతర కోచ్లకు తరలించారు. మంటల్లో చిక్కుకుని మూడు బోగీలు దెబ్బతిన్నాయి.
రైల్లో చోరీలు జరిగే తీరుపై ఆర్పీఎఫ్ అధికారి ఓ మహిళకు ఎన్నడూ మర్చిపోలేని విధంగా అవగాహన కల్పించిన తీరు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. ఈ వైరల్ వీడియో చూసిన జనాలు ఆ ఆర్పీఎఫ్ అధికారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కన్ఫర్మ్డ్ టిక్కెట్స్ ఉన్న ప్యాసెంజర్లు తమ జర్నీ తేదీని ఉచితంగా మరో రోజుకు మార్చుకునే అవకాశం లభించనుంది. ఈ మేరకు రైల్వేకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
దక్షిణ్ ఎక్స్ప్రెస్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ ప్రయాణికుడు రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయారు. ఘట్కేసర్ వద్ద ఈ దారుణం జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే (SCR) అత్యధికంగా 48 రైళ్లను నడుపనుంది. 684 ట్రిప్పులు పూర్తి చేస్తుంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
ప్రస్తుతం ప్రధాని మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్లో బుల్లెట్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానుంది. మరి ఈ బుల్లెట్ రైలు ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. సుదూర ప్రయాణాలంటే అందరూ రైళ్లనే ఎంచుకుంటారు. తమతో పాటు భారీగా లగేజ్ను కూడా తీసుకెళ్తుంటారు. అయితే ఇకపై లగేజ్ విషయంలో భారతీయ రైల్వే నిబంధనలను కఠినతరం చేసింది.
నికర కర్బన రహిత కార్యకలాపాల దిశగా రైల్వే శాఖ మరో పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరించింది. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు రైల్వే ట్రాక్స్ మధ్య సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. వారణాసిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టింది.