Home » Indian Railways
జులై 1 నుంచి భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను ప్రస్తుతం ఉన్న రూ.250 నుంచి రూ.500కు పెంచాలని నిర్ణయించింది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని రద్దీగా ఉండే 'ఝార్పడ వంతెన' సమీపంలో ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు సకాలంలో స్పందించడంతో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది.
ట్రైన్లో ప్రయాణిస్తూ మీ వస్తువులేమైనా మర్చిపోయారా? పోయిన/మర్చిపోయిన వస్తువులను ఎలా రాబట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నారా? టెన్షన్ పడకండి. రైలు ప్రయాణంలో మీ వస్తువులు ఏమైనా మర్చిపోతే వెంటనే ఈ పని చేయండి. మీ వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి..
రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను తెలంగాణకు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది.
రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది...
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ట్రైన్ బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు వరకూ బోర్డింగ్ పాయింట్ను మార్చుకునే అవకాశం కల్పించనుంది.
వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ బెర్త్ల కేటాయింపు విధానాన్ని పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రికార్డుస్థాయి కేటాయింపులు జరిగాయని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్ తెలిపారు.
రైలు ఆలస్యం కారణంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదంతా కష్టపడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆ విద్యార్థిని ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాడి చివరకు విజయం సాధించింది. అసలేం జరిగిందంటే..