BJP Leader: జగన్ సర్కార్పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-12-13T13:59:39+05:30
జగన్ సర్కార్పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: జగన్ సర్కార్పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (BJP State Vice President Vishnukumar Raju) Lసంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతున్నాయని... అరికట్టవల్సిన బాధ్యత కేంద్రం(Central Government)పై ఉందని అన్నారు. హత్యలు చేసిన ఎమ్మెల్సీలను జగన్ సర్కార్ కాపాడుతోందని విమర్శించారు. వైసీపీ నేతల వద్ద పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉందని ఆరోపించారు. ఏపీలో సీబీఐ, ఈడి, ఐటి రైడ్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. జగన్కు అడ్డుగా వచ్చిన వారిని ఆర్ధికంగా నరికేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నల్లధనం ఏపీలోనే ఉందని తెలిపారు. క్యాష్ ద్వారా లిక్కర్ అమ్మకాలు చేయడం వలన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నల్ల ధనాన్ని సంపాదించారని అన్నారు. ఈ డబ్బుతోనే వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారని... అందుకే 175 నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని అంటున్నారని విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు.
Updated Date - 2022-12-13T13:59:40+05:30 IST