ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nadendla manohar: రైతుల దగ్గర లంచం తీసుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ

ABN, First Publish Date - 2022-11-04T11:44:10+05:30

సీఎం జగన్ వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: సీఎం జగన్ (YS Jaganmohan reddy) వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. స్పందించే హృదయం లేని వ్యక్తికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. జనవాణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ప్రజల కష్టాలను సీఎం పట్టించుకోనందువలనే జనసేన జనవాణి చేపట్టిందని వెల్లడించారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ పెద్ద మోసానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.

ఈనెల 12,13,14 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలను సందర్శించి అక్రమాలను బయటపెడతామన్నారు. 18 లక్షల 60వేల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు ఆ ఇళ్ళు ఎక్కడ అని ప్రశ్నించారు. రైతుల దగ్గర లంచం తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం (YCP Government) చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. రైతుల దగ్గర తక్కువ రేటుకు భూములు తీసుకుని వాటిని జగనన్న కాలనీలకు ఎక్కువ రేటుకు అమ్ముకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు బాగుపడ్డారని నాదెండ్ల మనోహర్ (Janasena leader) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-04T11:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising