ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన పవన్ ..
ABN, Publish Date - Mar 26 , 2024 | 10:41 AM
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళతానని.. అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మూడు విడతలుగా ప్రచారం చేయాలని పవన్ నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 26 , 2024 | 10:44 AM