కందూరు రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Jan 16 , 2024 | 11:19 PM
అడ్డాకుల మండల పరిధిలోని దక్షిణ కాశీగా వెలు గొందుతున్న కందూరు రామలింగేశ్వరాలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వర్శదర్శనాలు నిర్వహించారు.
అడ్డాకుల, జనవరి 16: అడ్డాకుల మండల పరిధిలోని దక్షిణ కాశీగా వెలు గొందుతున్న కందూరు రామలింగేశ్వరాలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వర్శదర్శనాలు నిర్వహించారు. సోమవారం భక్తులు అధిక సంఖ్యలో రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. విజయలక్ష్మీ, అనంతరెడ్డి దంపతులు అ న్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయాధికారి కె.కుష రామలింగేశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వి శిష్టత, కల్పవృక్షాల వృత్తాంతమును వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలిసభ్యులు, చైర్మన్ రమేశ్గౌడ్, పూజారులు, కందూరు గ్రామస్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jan 16 , 2024 | 11:19 PM