కార్యకర్తలకు అండగా ఉంటా
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:45 PM
తాను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం అయోధ్యపూర్ తండా, చిన్న ఎల్కిచర్ల, పులుసుమామిడి, పర్వతాపూర్, మహదేవ్పూర్, భైరంపల్లి, ఉత్తరా్సపల్లి, ముట్పుర్, రేగడి చిల్కమ ర్రి, లాలాపేట్, ఉమ్మెంత్యాల గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.
కొందుర్గు, జనవరి, 29 : తాను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం అయోధ్యపూర్ తండా, చిన్న ఎల్కిచర్ల, పులుసుమామిడి, పర్వతాపూర్, మహదేవ్పూర్, భైరంపల్లి, ఉత్తరా్సపల్లి, ముట్పుర్, రేగడి చిల్కమ ర్రి, లాలాపేట్, ఉమ్మెంత్యాల గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచి నా, ఓడినా ప్రజలతోనే ఉంటానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కు మెరుగైన పాలన అందించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీ పీ రాజేష్పటేల్, నాయకులు నారాయణయాదవ్, శ్రీధర్రెడ్డి, సంధ్యారాణి శేఖర్, అంజనేయులు, రెడ్డి నర్సింలు, గోపాల్, బద్ది, బందులాల్, కలాం, దర్గా రాంచంద్రయ్య, సరస్వతి, విజయ్కుమార్, మాజిద్ పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 11:45 PM