ప్రారంభమైన వెంకటేశ్వరుడి పవిత్రోత్సవాలు
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:32 PM
షాద్నగర్ పట్టణంలోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.
షాద్నగర్ అర్బన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): షాద్నగర్ పట్టణంలోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ పూజారులు ఉత్సవ విగ్రహాలకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్యంగ్రహణము, అంకురారోపణము, పత్రాదివాసము కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం స్వామికి పుషయాగం, పవిత్ర మాలధారణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పలబట్ల బాల్రాజ్గుప్త, పరిగి వెంకటసాయిశ్వర్రెడ్డి, ఎల్. మోహన్రెడ్డి, టి. ప్రతాప్రెడ్డి, ఒగ్గు కిషోర్, ఆర్. కృష్ణయ్య, కానుగు రాంభూపాల్, సూరిశెట్టి నర్సింహగుప్తా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 11:32 PM