రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:46 PM
రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మేడ్చల్ టౌన్, జనవరి 29: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణం కిష్టాపూర్ నివాసి ప్రభాషిణి(18) సమీపంలోని సింఘానియా పరిశ్రమలో పని చేసి ఆదివారం రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో కిష్టాపూర్ వద్ద ట్రాక్టర్ ఢీకొంది. దీంతో ప్రభాషిణికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 29 , 2024 | 11:46 PM