వేర్వేరు చోట్ల ఇద్దరి ఆత్మహత్య
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:18 AM
జిల్లా కేంద్రంలో వేర్వేరు చోట్ల బుధవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
భువనగిరి టౌన, జనవరి 17: జిల్లా కేంద్రంలో వేర్వేరు చోట్ల బుధవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణ ఇన్సపెక్టర్ ఎస్.సుధీర్కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక హుస్సేనాబాద్కు చెందిన వల్దాస్ రాము (18) ఓ ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నాడు. కానీ ఆరోగ్య సమస్యలతో పట్టణ శివారులోని సీతానగర్లోని ఓ వెంచర్లో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మరో ఘటనలో వ్యవసాయ శాఖలో నైట్ వాచమనగా పని చేస్తున్న స్థానిక బంజారాహిల్స్కు చెందిన నాగిళ్ల ఈదయ్య (50) బుధవారం ఇంట్లో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్సపెక్టర్ తెలిపారు.
Updated Date - Jan 18 , 2024 | 07:56 AM