మూడోసారి మోదీని ప్రధానిని చేయాలి : బూర
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:33 AM
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థు ల ను గెలిపించి మూడోసారి నరేంద్రమోదీని దేశ ప్రధానిగా చేయాలని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నాగం వర్షితరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.
మూడోసారి మోదీని ప్రధానిని చేయాలి : బూర
చిట్యాలరూరల్, జనవరి 28: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థు ల ను గెలిపించి మూడోసారి నరేంద్రమోదీని దేశ ప్రధానిగా చేయాలని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నాగం వర్షితరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చిట్యాల మం డలం నేరడ గ్రామంలో ఆదివారం పార్టీ జెండాతో పాటు వికసిత సంకల్ప్ భారత క్యా లెండర్ వారు ఆవిష్కరించి మాట్లాడారు. పీఎం మోదీ దేశంలోని పేద, సామాన్య ప్ర జల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మోదీ హయాంలో దేశం పురోభివృద్ధిని సాధించిందని, దేశాభివృద్ధి కోసం ఆయన అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూ డా వ్యాక్సిన అందించిన ఘనత మోడీకే దక్కిందని అన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం చేపడుతున్న పథకాల గు రించి విస్తృతంగా ప్రచారం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వికసిత సంకల్ప్ భారత యాత్రను చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో ని యోజకవర్గ కన్వీనర్ మైల నర్సింహ, మండల అధ్యక్షుడు పొట్లపల్లి నర్సింహ, మాడూ రి ప్రభాకర్రావు, పాపని వనజ, గంజి గోవర్ధన, వరికుప్పల నర్సింమ, పొట్టబత్ని గో పాలకృష్ణ, పొట్టబత్తిని శ్రీను, మిర్యాల మోహన కృష్ణ, గిరి, వెంకన్న, కూరెళ్ల శ్రీను, ప ల్స శ్రీను, పబ్బు వెంకన్న, కన్నెబోయిన మహలింగం, మాస శ్రీను, నరేష్, పాపని వా సుదేవ్, వెంకటేష్, అనిల్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:33 AM