ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ డ్రైవర్ల సమ్మె

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:17 AM

నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ గోదావరిఖనిలో లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు.

కోల్‌సిటీ, జనవరి 11: నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ గోదావరిఖనిలో లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. బుధవారం అర్ధరాత్రి నుంచి రామగుండం లారీ డ్రైవర్స్‌ అండ్‌ క్లీనర్స్‌ మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌, లారీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నెల 9వ తేది నుంచి 13వ తేది వరకు బుకింగ్‌ కూడా నిలిపివేస్తున్నట్టు లారీ యజమానుల సంక్షేమ సంఘం పేర్కొన్నది. ఈ చట్టాన్ని వెంటనే వాపసు తీసుకోవాలని, లారీ డ్రైవర్లతో పాటు సామాన్యులకు కూడా ఎంతో నష్టం చేకూరుస్తుందన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో డ్రైవర్స్‌ అసోసియేషన్‌ ఎండీ రషీద్‌, ఫినాజ్‌, లారీ ఓనర్స్‌ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కడారి సంతోష్‌రావు, దామోదర్‌రెడ్డి, బాబురావు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising