బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి
ABN, Publish Date - Mar 29 , 2024 | 12:09 AM
బహుజనులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యా ధికారం చేపట్టాలని బీఎస్పీ పార్లమెంట్ ఇన్చార్జి కాదాసు రవీందర్ పిలుపుని చ్చారు.
కళ్యాణ్నగర్, మార్చి 28: బహుజనులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యా ధికారం చేపట్టాలని బీఎస్పీ పార్లమెంట్ ఇన్చార్జి కాదాసు రవీందర్ పిలుపుని చ్చారు. గురువారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజనులను తరతరాలుగా అణచివేస్తూ వస్తున్నారని, పెట్టుబడిదారుల చేతుల్లోనే దేశం ఉంటుందని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బహుజనులు ఏకమై ఎంపీగా గెలిపించుకోవాలని ఆయన అన్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో బహుజనులంతా ఏకమైతే రాజ్యాధికారం చేపట్టవచ్చన్నారు. బీఎస్పీ లోకి ప్రవీణ్కుమార్ ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్లాడో తెలియదని, ప్రవీణ్ కుమార్లాంటి వారు ఎంతో మంది బీఎస్పీలోకి వచ్చి వెళ్లారని, బీఎస్పీ పార్టీకి మనుషులు ముఖ్యం కాదని, పేద ప్రజల కోసం శ్రమించేది బీఎస్పీ పార్టీనేనని ఆయన అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు ఇరికిళ్ల రాజనర్సయ్య, కనకయ్య, శారద, అనిత, మహేష్, లింగయ్య, మల్లేష్, ఉప్పులేటి పర్వతాలు, సది, సంతోష్ పాల్గొన్నారు.
Updated Date - Mar 29 , 2024 | 12:09 AM