ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైతులను సర్కారు ఆదుకోవాలి

ABN, Publish Date - Apr 01 , 2024 | 05:29 AM

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవటం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున

ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవటం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని, మంగళవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం వద్ద ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘రైతు దీక్ష’ చేపడతామని ప్రకటించారు. వడ్ల కల్లాల వద్ద బస చేసి.. రైతులు పడుతున్న బాధలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తన దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 2-3 రోజుల్లో ప్రణాళికను వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రైతుల పక్షాన బీజేపీ డిమాండ్లు ఇవే..

తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానించాలి. రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. సమగ్ర పంటల బీమాను అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలి. కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలి.

Updated Date - Apr 01 , 2024 | 05:29 AM

Advertising
Advertising