ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మూల్యాంకన కేంద్రంలో వసతులు కల్పించాలి

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:50 PM

చ్చే నెల మూడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఉన్నందున అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ పీఆర్టీయూ నాయకులు కోరారు.

డీఈవో రవీందర్‌కు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 28 : వచ్చే నెల మూడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఉన్నందున అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ పీఆర్టీయూ నాయకులు కోరారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని మూల్యాంకన కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ పీఆర్టీయూ వై.శ్యామ్‌బాబు, ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ తెలిపారు. గురువారం తెలంగాణ పీఆర్టీయూ నాయకులు డీఈవో రవీందర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు వివరించారు. వచ్చేనెల 3 నుంచి జరిగే మూల్యాంకనంలో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు, గర్భిణులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అన్ని గదుల్లో ఏసీలు, ఫ్యాన్‌లు, లైట్స్‌, బిగించాలన్నారు. 58 ఏళ్ళు దాటిన ఎస్‌జీటీలకు మూల్యాంకనంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లపై డీఈవో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 11:50 PM

Advertising
Advertising