NTR Death Anniversary: కడప టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు..
ABN, Publish Date - Jan 18 , 2024 | 06:12 PM
NTR Death Anniversary: ఉమ్మడి కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు.
ఉమ్మడి కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి,నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు.
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు కడప నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి మాధవి రెడ్డి, ఇతర నాయకులు.
ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యాలయ నిర్వాహణ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, హరి ప్రసాద్, ఇతర నాయకులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు టీడీపీ నేతలు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం.. పేదప్రజల సంక్షేమానికి పాటుపడిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
Updated Date - Jan 18 , 2024 | 06:15 PM