నేటి అలంకారం శ్రీ దుర్గాదేవి
ABN, Publish Date - Oct 10 , 2024 | 01:23 AM
శరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజున విజయవాడ కనకదుర్గమ్మ... శక్తి రూపమైన దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుణ్ణి వధించి, ఇంద్రకీలాద్రిపై దుర్గగా... స్వయంభువై అమ్మవారు వెలసినది ఈ అష్టమి
ఆశ్వయుజ శుద్ధ సప్తమి/అష్టమి (దుర్గాష్టమి)- గురువారం
శరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజున విజయవాడ కనకదుర్గమ్మ... శక్తి రూపమైన దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుణ్ణి వధించి, ఇంద్రకీలాద్రిపై దుర్గగా... స్వయంభువై అమ్మవారు వెలసినది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అష్టమిని ‘దుర్గాష్టమి’ అని వ్యవహరిస్తారు. ‘దుర్గే దుర్గతినాశని’... అంటే దుర్గతులను నాశనం చేసే వేలుపు దుర్గమ్మ. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది. ఆమె శక్తి అనంతమైనది. దుర్గాదేవిది ఉగ్రరూపం. అయినా భక్తులపై ఆమె అవ్యాజమైన కరుణ కురిపిస్తుంది. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి దుర్గా మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ పెద్దలు భక్తుల నమ్మకం.
నైవేద్యం: చిత్రాన్నం
అలంకరించే చీర రంగు: ఎరుపు
వేటితో అర్చించాలి: గులాబీలు, ఎర్రటిపూలు, కుంకుమ
పారాయణ: చెయ్యాల్సినవి:
దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకి
Updated Date - Oct 10 , 2024 | 01:26 AM