చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిర శాంతి బహుమతి
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:38 AM
చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెలీ బాచెలెట్కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2024 దక్కింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 6: చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెలీ బాచెలెట్కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2024 దక్కింది. అంతర్జాతీయంగా మానవ హక్కులు, శాంతి, సమానత్వం కోసం ఆమె చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ మీడియాకు వెల్లడించింది. మిచెలీ బాచెలెట్ గతంలో ఐక్యరాజ్య సమితి మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘంకు డైరెక్టర్గా వ్యవహరించారు. లింగ సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం గళమెత్తారు.
Updated Date - Dec 07 , 2024 | 04:38 AM