ఎరువులపై సబ్సిడీని తగ్గించిన కేంద్రం
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:05 AM
ఎరువులపై రైతులకు కేంద్రప్రభుత్వం అందించే సబ్సిడీ ఈ ఏడాది భారీగా తగ్గనుంది. సబ్సిడీలను గత ఏడాది కంటే 30 నుంచి 34 శాతం మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు.
న్యూఢిల్లీ, జనవరి 17: ఎరువులపై రైతులకు కేంద్రప్రభుత్వం అందించే సబ్సిడీ ఈ ఏడాది భారీగా తగ్గనుంది. సబ్సిడీలను గత ఏడాది కంటే 30 నుంచి 34 శాతం మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పోయిన సంవత్సరం రూ. 2.56 లక్షల కోట్ల సబ్సిడీలు ఇవ్వగా, ఈ ఏడాది రూ. 1.7 నుంచి 1.8 లక్షల కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ఎరువుల ధరలు తగ్గడం, భారతదేశంలో ప్రస్తుతం ఎరువుల కొరత లేకపోవడంతో సబ్సిడీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎరువుల దిగుమతుల్లో ఏ మాత్రం తగ్గుదల లేదని, ఈ ఏడాది 40 నుంచి 50 లక్షల టన్నుల మేర దిగుమతులుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Updated Date - Jan 18 , 2024 | 08:42 AM