పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN, Publish Date - Oct 17 , 2024 | 12:35 AM
పేదలకు మెరుగైన వైద్యసేవలందించడంలో ఏరియా ఆసుపత్రులు, సీ హెచ్సీల వైద్యులు చొరవ చూపించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
భీమవరం ఎడ్యుకేషన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):పేదలకు మెరుగైన వైద్యసేవలందించడంలో ఏరియా ఆసుపత్రులు, సీ హెచ్సీల వైద్యులు చొరవ చూపించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీల పనితీరును సమీక్షించారు. పనివేళల్లో వైద్యులు ఆసుపత్రుల్లో ఉండి తీరాల్సిందేనని హెచ్చరించారు. కొన్ని వైద్య సేవలకు నగదు వసూలు చేయడంపై మండిపడ్డారు. ఆకివీడు, ఆచంట ఆసుపత్రులలో వైద్యసేవలను మెరుగు పరుచుకోవాలన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డీఎంహెచ్వో డాక్టర్ మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఉచితంగా వైద్యం అందించాలి..
ఎన్టీఆర్ వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రు లు పేదలకు ఉచితంగా వైద్యమందించాలని కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. జిల్లా డిసిప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవలందిస్తున్న కొన్ని ఆసుప త్రుల్లో పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తున్నారని, వైద్యం అందించడంలో అలస త్వం వహిస్తున్నారని మండిపడ్డారు.
Updated Date - Oct 17 , 2024 | 12:35 AM