ఘనంగా పెద పోలమాంబ ప్రధాన ఉత్సవం
ABN, Publish Date - Jan 02 , 2024 | 11:27 PM
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రామంలో అమ్మవారి మేనత్త పెదపోలమాంబకు ప్రధాన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మక్కువ, జనవరి 2 : ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రామంలో అమ్మవారి మేనత్త పెదపోలమాంబకు ప్రధాన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ఘటాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు బుధవారం అంపకోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 8న పోలమాంబను గ్రామంలోకి తీసుకురా వడంతో శంబర గ్రామంలో జాతర కళ సంతరించుకుంటుంది. దూర ప్రాంతా ల వారు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Jan 02 , 2024 | 11:27 PM