ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారిపై ఏనుగులు

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:31 PM

కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామ రహ దారిపై బుధవారం ఏనుగుల సంచరించాయి. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

రాజ్యలక్ష్మీపురం గ్రామ రహదారిపై సంచరిస్తున్న ఏనుగుల గుంపు

కొమరాడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామ రహ దారిపై బుధవారం ఏనుగుల సంచరించాయి. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఏడు ఏనుగుల గుంపును ఒక్కసారిగా చూసి హడలెత్తిపోయారు. అవి ఎవరిపై దాడి చేస్తాయోనని తీవ్ర ఆందోళన చెందారు. గజరాజుల హల్‌చల్‌ కారణంగా ఆ రహదారిలో సుమారు గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సమీప పంట పొలాల్లోకి ఏనుగులను తరలించారు. దీంతో ఆ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా ఏనుగుల గుంపు కుమ్మరిగుంట, కంబవలస, కందివలస, తదితర గ్రామాల్లో సంచరిస్తుండటంతో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:31 PM