Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం
ABN, Publish Date - Jan 23 , 2024 | 05:40 PM
రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం తెలిపారు.
అమరావతి: రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్ధతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
రాజ్యసభ ఎన్నికల దృష్యా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎత్తుగడులు వేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి గూటికి చేరిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Updated Date - Jan 23 , 2024 | 06:31 PM