టీడీపీలో చేరిన బాతుపురం వాసులు
ABN, Publish Date - Jan 13 , 2024 | 12:04 AM
సోంపేట మండలం బాతుపురం గ్రామస్థులు ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు.
పార్టీ కండువాలు వేస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్
కవిటి: సోంపేట మండలం బాతుపురం గ్రామస్థులు ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వంలో నిరాధరణకు గుర య్యామని గ్రామంలో సరైన అభివృద్ధి జరగకపోవడంతో టీడీపీలో చేరామని పలు వురు తెలిపారు. వీరి చేరికలను కొంతమంది వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయ త్నం చేసినా ససేమిరా అంటూ రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్రహ్మానందం, కృష్ణారావు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2024 | 12:04 AM