ఎమ్మెల్యే చంద్రశేఖర్కు నోటీసులు
ABN, Publish Date - Nov 27 , 2024 | 01:45 AM
గత ఎన్నికల సమయంలో నిబంధనలు పాటించకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై అప్పటి అధికారుల ఫిర్యాదు మేరకు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్యాంపు కార్యాలయంలో అందజేసిన పెద్దారవీడు ఎస్సై
ఎర్రగొండపాలెం రూరల్ నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : గత ఎన్నికల సమయంలో నిబంధనలు పాటించకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై అప్పటి అధికారుల ఫిర్యాదు మేరకు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సంబందించిన 41ఏ నోటీసులను మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో పెద్దారవీడు ఎస్సై పి.అనిల్కుమార్ అందజేశారు. చంద్రశేఖర్పై ఇప్పటికే ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు పెద్దారవీడు మండలంలో కేసుతో మొత్తం ఆ సంఖ్య ఆరుకు చేరింది.
Updated Date - Nov 27 , 2024 | 01:45 AM