బలిజ కులస్థులు అన్ని రంగాల్లో రాణించాలి
ABN, Publish Date - Nov 24 , 2024 | 11:52 PM
విద్య, వ్యాపార, రాజకీ య, వైద్య, సేవా రంగాల్లో బలిజ కులస్థులు సంఘటితం గా రాణించాలని పీలేరు పట్ట ణ బలిజ సేవా సంఘం నా యకులు పిలుపునిచ్చారు.
పీలేరు, నవంబరు 24(ఆంధ్ర జ్యోతి): విద్య, వ్యాపార, రాజకీ య, వైద్య, సేవా రంగాల్లో బలిజ కులస్థులు సంఘటితం గా రాణించాలని పీలేరు పట్ట ణ బలిజ సేవా సంఘం నా యకులు పిలుపునిచ్చారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సదుం రోడ్డులో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఐకమత్యం లేకపోవడం వల్ల బలిజలు అన్ని రం గాల్లో అనేక అవకాశాలు కోల్పోతున్నారని వాపోయారు. అనంతరం కార్తీక వనభోజ నాలు చేశారు. కార్యక్రమంలో రిటైర్డు ఆర్ఐవో గన్నా ప్రభాకర్, మాజీ ఎంపీపీ కోలా మణి, జనసేన పీలేరు ఇనఛార్జ్ బెజవాడ దినేశ, డాక్టర్మల్లిఖార్జున, రిటైర్డు ట్రెజరీ అధికారి పీవీ రమణ, డిష్ పురుషోత్తం, బలిజ సంఘం నిర్వాహకులు పోతంశెట్టి రమేశ, వి.రామచంద్ర, పసుపులేటి లక్ష్మీకర, బంగారు నాగేంద్ర ప్రసాద్, జ్ఞానంగారి హరీశ, బోయల్ల మధు, బాలిశెట్టి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 11:52 PM