కౌతవరంలో వైసీపీ నుంచి 100 మంది టీడీపీలో చేరిక
ABN, Publish Date - Feb 01 , 2024 | 01:07 AM
మండలంలోని కౌతవరంలో వైసీపీ నాయకులు వడ్లమూడి యుగంధర్, బీసీ నాయకుడు ఈడే కృష్ణ ఆధ్వర్యంలో 100 మంది వైసీపీ కార్యకర్తలు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.
గుడ్లవల్లేరు, జనవరి 31 : రాష్ట్రంలో జగన్ అరాచక పాలన, గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రవర్తనతో ప్రజలు విసిగిపోయారని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వెనిగండ్ల రాము అన్నారు. మండలంలోని కౌతవరంలో వైసీపీ నాయకులు వడ్లమూడి యుగంధర్, బీసీ నాయకుడు ఈడే కృష్ణ ఆధ్వర్యంలో 100 మంది వైసీపీ కార్యకర్తలు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాప య్య చౌదరి, కౌతవరం పార్టీ సీనియర్ నాయకులు వి.వి.కె.వి సుబ్బారావు, మల్లిపెద్ది సుబ్రమ్మణ్యం, మద్దాల జోజి, చిట్టిబొమ్మ నరసింహారావు, వడ్లమూడి దేశపతి, నాగన్న పాల్గొన్నారు.
Updated Date - Feb 01 , 2024 | 01:07 AM