పశుసంపదను కాపాడుకుందాం
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:11 AM
పశుసంపదను కాపాడుకుం దామని పశుపోషకులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు.
పశుపోషకులకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల పిలుపు
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పశుసంపదను కాపాడుకుం దామని పశుపోషకులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. శనివారం తన కార్యాలయం వద్ద 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని వాల్ పోస్టర్లు ఆవిష్కరించి ఆయన ప్రారంభించారు. పశుగణన సక్రమంగా నిర్వహిస్తే పశువుల సంఖ్య తెలుస్తుందని, సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలవుతుందని ఆయన స్పష్టం చేశారు. పశుసంవర్థక శాఖ జిల్లా అఽధికారి ఎన్సీహెచ్ నరసింహులు, ఆ శాఖ డీడీ నాగ భూషణం, సర్జన్ ఆర్.వెంకట్రావు, సీతారామయ్య పాల్గొన్నారు. అంతకుముందు పశు సం వర్థక కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బంది ‘స్వచ్ఛభారత్’ను నిర్వహించారు.
Updated Date - Oct 27 , 2024 | 01:11 AM