నేడు ‘మన్యం’లో కంటైనర్ ఆసుపత్రి ప్రారంభం
ABN, Publish Date - Nov 25 , 2024 | 04:08 AM
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గిరిశిఖర గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని సోమవారం ప్రారంభించనున్నారు.
పార్వతీపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గిరిశిఖర గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని సోమవారం ప్రారంభించనున్నారు. నాలుగు బెడ్స్తో కూడిన కంటైనర్ గిరి వైద్య కేంద్రం ద్వారా గిరి పుత్రులకు స్థానికంగానే వైద్య సేవలు అందించనున్నారు. గిరిజనులకు డోలీ కష్టాలు తప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కంటైనర్ ఆసుపత్రికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మన్యం జిల్లా నుంచే తొలిసారి ఈ వైద్య సేవలు అందించనున్నారు. గిరిజన సంక్షేమశాఖ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Updated Date - Nov 25 , 2024 | 04:09 AM