ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పులిచెర్ల మండలంలో వలంటీరు తొలగింపు

ABN, Publish Date - Mar 21 , 2024 | 12:47 AM

పులిచెర్ల మండలంలో ఈనెల 17న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీలో కల్లూరు పంచాయతీకి చెందిన వలంటీరు ఖాదర్‌బాషా పాల్గొనడంపై అధికారులకు ఫిర్యాదు అందింది.

ర్యాలీలో క్షేత్రసహాయకుడు ప్రసాద్‌ పాల్గొన్నట్లు టీడీపీ నాయకులు ఇచ్చిన ఫొటో

ఉపాధి క్షేత్రసహాయకుడిపై విచారణ నివేదిక అందజేత

కల్లూరు, మార్చి 20: పులిచెర్ల మండలంలో ఈనెల 17న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీలో కల్లూరు పంచాయతీకి చెందిన వలంటీరు ఖాదర్‌బాషా పాల్గొనడంపై అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఇదే ర్యాలీలో పాల్గొన్న దిగువపోకలవారిపల్లి పంచాయతీకి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడు ప్రసాద్‌పైనా టీడీపీ నాయకులు సీ-విజిల్‌, ఎంపీడీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు. క్షేత్రసహాయకుడు ప్రసాద్‌ని ఎంపీడీవో విచారించి రాతపూర్వకంగా సంజాయిషీని తీసుకున్నారు. ఈ విచారణ నివేదికను డ్వామా పీడీ రాజశేఖర్‌కు పంపామని ఎంపీడీవో తెలిపారు. కాగా, ఇదే ర్యాలీకి సంబంధించి అందిన ఫిర్యాదులపై ఇప్పటికే వెంకటదాసరపల్లి పంచాయతీకి చెందిన ఇద్దరు వలంటీర్లను తొలగించగా, అయ్యావాండ్లపల్లి పంచాయతీకి చెందిన ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకుడిపై ఉన్నతాధికారులకు మంగళవారం ఎంపీడీవో నివేదిక అందించారు.

Updated Date - Mar 21 , 2024 | 12:47 AM

Advertising
Advertising