ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరేళ్ల తర్వాత ఆర్టీసీకి కొత్త కళ

ABN, Publish Date - Jan 06 , 2024 | 01:20 AM

ఆరేళ్ల తర్వాత జిల్లాకు కొత్త ఆర్టీసీ బస్సులు రానున్నాయి. పైగా తాజా సాంకేతిక పరిజ్ఞానం(భారత్‌స్టేజ్‌ 6 టాటా, లేల్యాండ్‌ బస్సులు)తో కూడిన సరికొత్త బస్సులు రానున్నాయి.

విజయవాడ వర్క్‌షాపులో బాడీ ఫిట్టింగ్‌ చేస్తున్న నిపుణులు

తిరుపతి(కొర్లగుంట), జనవరి 5: ఆరేళ్ల తర్వాత జిల్లాకు కొత్త ఆర్టీసీ బస్సులు రానున్నాయి. పైగా తాజా సాంకేతిక పరిజ్ఞానం(భారత్‌స్టేజ్‌ 6 టాటా, లేల్యాండ్‌ బస్సులు)తో కూడిన సరికొత్త బస్సులు రానున్నాయి. ఫిబ్రవరి నుంచి మే వరకు విడతల వారీగా ఇవి రోడ్డెక్కనున్నాయి. తిరుపతి జిల్లాలోని 11డిపోల పరిధిలో దాదాపు 800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇవన్నీ 2018 జూలైకు ముందు ఆయా డిపోలకు వచ్చినవే. ఆ తర్వాత ఒక్క బస్సును కూడా ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయలేదు. ఉన్నవాటికే తాత్కాలిక రిపేర్లు, మరమ్మతులు చేసుకుంటూ కాలం గడిపింది. ఈ క్రమంలో విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం మార్గదర్శకాల ప్రకారం 252(అమరావతి ఏసీ వోల్వో-10, సూపర్‌లగ్జరి-32, అల్ర్టాడీలెక్స్‌-11, ఎక్స్‌ప్రెస్‌-52, పల్లెవెలుగు-147)బస్సులను కాలం చెల్లినవిగా గుర్తించారు. వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. టాటా, అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీల నుంచి కొత్త బస్సుల ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి.

డిపోల వారీగా కొత్తబస్సులు

తిరుపతి-41 : సూపర్‌లగ్జరీ 7, అల్ర్టాడీలెక్స్‌ 8, ఎక్స్‌ప్రెస్‌ 3, పల్లెవెలుగు 23

మంగళం-29 : అమరావతి ఏసీ వోల్వో 10, సూపర్‌లగ్జరీ 2, పల్లెవెలుగు 17

పుత్తూరు-18 : సూపర్‌లగ్జరీ 2, పల్లెవెలుగు 16

శ్రీకాళహస్తి-11 : సూపర్‌లగ్జరీ 2, అల్ర్టాడీలెక్స్‌ 2, పల్లెవెలుగు 7

వెంకటగిరి-41 : సూపర్‌లగ్జరీ 13, ఎక్స్‌ప్రెస్‌ 11, పల్లెవెలుగు 17

గూడూరు-36 : ఎక్స్‌ప్రెస్‌ 16, పల్లెవెలుగు 20

వాకాడు-43 : ఎక్స్‌ప్రెస్‌ 16, పల్లెవెలుగు 27

సూళ్లూరుపేట-20 : సూపర్‌లగ్జరీ 5, ఎక్స్‌ప్రెస్‌ 4, పల్లెవెలుగు 11

సత్యవేడు-13 : సూపర్‌లగ్జరీ 1, అల్ర్టాడీలెక్స్‌ 1, ఎక్స్‌ప్రెస్‌ 2, పల్లెవెలుగు 9

త్వరలో మరో 50 ఎలక్ర్టిక్‌ బస్సులు

అద్దె ప్రాతిపదికన త్వరలో మరో 50 ఎలక్ర్టిక్‌ బస్సులు తిరుపతి జిల్లాకు రానున్నాయి. ఈ మేరకు టెండర్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఒలెక్ర్టా కంపెనీకి చెందిన ఎలక్ర్టిక్‌ బస్సులు ఇప్పటికే జిల్లాలో 100 దాకా తిరుగుతున్నాయి.తాజాగా వచ్చే బస్సులను శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య 24, మిగిలిన 26 తిరుపతి కేంద్రంగా 70కిలోమీటర్ల దూరం వరకు ప్రముఖ నగరాలకు నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 01:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising