ఏపీకి నాలుగు జాతీయ అవార్డులు
ABN, Publish Date - Dec 07 , 2024 | 05:33 AM
రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి.
అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ‘ఆరోగ్యకర’ కేటగిరిలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం, ‘సంతృప్తికర తాగునీరు’లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి, ‘పచ్చదనం-పరిశుభద్రత’లో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి, ‘సామాజిక భద్రత’ కేటగిరీలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీకి ఈ అవార్డులు దక్కాయి. 11న ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగే జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయా సర్పంచ్లు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా మెమోంటో, రూ.కోటి నగదు అందుకోనున్నారు. 2022-23లో పైన పేర్కొన్న అంశాల్లో చూపిన పనితీరుతో ఈ అవార్డులు వరించాయి.
Updated Date - Dec 07 , 2024 | 05:34 AM