యువకుడి ఆత్మహత్య
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:14 AM
తనకల్లు, జనవరి 17: మండలంలోని ఎగువతొట్లిపల్లి గ్రామానికి చెందిన భానుప్రకాష్(25) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తనకల్లు, జనవరి 17: మండలంలోని ఎగువతొట్లిపల్లి గ్రామానికి చెందిన భానుప్రకాష్(25) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. భానుప్రకాష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. పని ఒత్తిడి భరించలేక ఇటీవల ఉద్యోగం వదిలి ఇంటికి వచ్చాడు. కాగా ఈనెల 3వ తేదీన మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బెంగుళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం తండ్రి క్రిష్ణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - Jan 18 , 2024 | 12:14 AM