ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:34 AM

కదిరి, జనవరి 11: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

- టీడీపీ శ్రేణులకు కందికుంట సూచన - వైసీపీ నుంచి 25 కుటుంబాల చేరిక

కదిరి, జనవరి 11: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం తలుపుల మండలం పులిగిండ్లపల్లి, ఉడమలకుర్తి పంచాయతీలకు చెందిన 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతిఒక్కరూ టీడీపీ విజయానికి సైనికుల్లా కృషి చేయాలన్నారు. కష్ట పడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. చేరిన వారిలో సోమాలవాండ్లపల్లికి చె ందిన మార్కండేయ, వీర కొండయ్య, పాపయ్య, పూజ, పుల్లిగిండ్లపల్లికి చెందిన వెంకటేష్‌, క్రిష్ణ, జీవన, పద్మావతమ్మ, నారాయణమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తలుపుల మండల నాయకులు ముబారక్‌, మేడా శంకర్‌, విశ్వనాథ్‌రెడ్డి, రాజారెడ్డి, రమణ, నారాయణరెడ్డి, బాబ్‌జాన, రాధాకృష్ణ, అంజి, రామ్మోహన తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising