ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ గెలుపు.. ప్రగతికి పిలుపు: అమిలినేని

ABN, Publish Date - Mar 27 , 2024 | 11:51 PM

నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తే పల్లెలన్నీ ప్రగతిపథంలో అభివృద్ధి దిశగా పయనిస్తాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు.

సురేంద్రబాబుకు హారతి పడుతున్న మహిళలు

కళ్యాణదుర్గం, మార్చి 27: నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తే పల్లెలన్నీ ప్రగతిపథంలో అభివృద్ధి దిశగా పయనిస్తాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. బుధవారం శెట్టూరు మండల మాకొడికి, కరిడిపల్లి గ్రామాల్లో ఆయన పెద్దఎత్తున రోడ్‌ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, తాగునీరు అందించి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందిస్తూ రైతుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు చాలా అధ్వానంగా వున్నాయని, కనీసం గుంతలు కూడా పూడ్చకుండా వదిలేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు బాగుచేస్తామన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా మురుగునీరు దర్శనమిస్తున్నాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తామన్నారు. పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించాలంటే టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు టీడీపీని ఆదరించాలన్నారు. అమిలినేని ప్రచారానికి ఎక్కడ చూసినా అపూర్వ ఆదరణ లభిస్తోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:51 PM

Advertising
Advertising