అలరించిన భక్తి గీతాలు
ABN, Publish Date - Mar 29 , 2024 | 12:49 AM
పుట్టపర్తి, మార్చి 28: సత్యసాయి విద్యార్థులు సంగీత గానంతో భక్తులను అలరించారు. పట్టణంలోని ప్రశాంతి నిలయంలో గల సాయికుల్వంత హాల్లో గురువారం సాయంత్రం సత్యసాయి సంగీత కళాశాల విద్యార్థులు సాయిస్వరతాళార్పణం పేరిట వాయిద్యగాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పుట్టపర్తి, మార్చి 28: సత్యసాయి విద్యార్థులు సంగీత గానంతో భక్తులను అలరించారు. పట్టణంలోని ప్రశాంతి నిలయంలో గల సాయికుల్వంత హాల్లో గురువారం సాయంత్రం సత్యసాయి సంగీత కళాశాల విద్యార్థులు సాయిస్వరతాళార్పణం పేరిట వాయిద్యగాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు వీణ, తబలా వాయిద్యాలతో మధుర గానాలు ఆలపించి భక్తులను మైమరపింపజేశారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
Updated Date - Mar 29 , 2024 | 12:49 AM