ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం
ABN, Publish Date - Jan 29 , 2024 | 02:16 AM
అంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహంపై ఆదివారం గుర్తు తెలియని
ఆదోని, జనవరి 28: అంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహంపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పేడ వేశారు. దీనిపై ఆర్యవైశ్య సంఘం నాయకులు అక్కడ చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Updated Date - Jan 29 , 2024 | 02:16 AM