విశాఖకు దొడ్డిదారిన.. ముహూర్తం తేదీ లీక్..
ABN, First Publish Date - 2023-11-24T08:23:45+05:30
అమరావతిని అటకెక్కించి.. మూడు రాజధానుల రాగం తీసిన ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల ముందు షిఫ్టింగ్ నాటకానికి తెరలేపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంఖుస్థాపనలు నమ్మొద్దు.. అవన్నీ మోసాలేనని విపక్ష హోదాలు హోరెత్తించిన ఆయన ...
అమరావతిని అటకెక్కించి.. మూడు రాజధానుల రాగం తీసిన ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల ముందు షిఫ్టింగ్ నాటకానికి తెరలేపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంఖుస్థాపనలు నమ్మొద్దు.. అవన్నీ మోసాలేనని విపక్ష హోదాలు హోరెత్తించిన ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముహూర్తానికి మూడు, నాలుగు నెలల ముందు ఉత్తరాంధ్ర ఉద్ధరణ అంటూ బయలుదేరారు. మీ బిడ్డ సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతాడు. అని అప్పుడెప్పుడో ప్రకటించారు. ఆ తర్వాత అది అక్టోబర్కు, ఇప్పుడు డిసెంబర్కు మారిపోయింది. తాజాగా వచ్చేనెల 8న సీఎం క్యాంప్ కార్యాలయం తరలింపునకు ముహూర్తం నిర్ణయించినట్లు లీకులిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-24T08:23:46+05:30 IST