కాంగ్రెస్పై మర్రి ఘాటు విమర్శలు..
ABN, First Publish Date - 2023-11-22T13:06:04+05:30
నాగర్ కర్నూల్: నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను మూడోసారి గెలిపించేలా చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్: నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను మూడోసారి గెలిపించేలా చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ది బలుపు కాదు.. కేవలం వాపు అని ఘాటు విమర్శలు చేశారు. మూడోసారి విజయం సాధించేందుకు ప్రచారాన్ని ఉధృతం చేశారు. గ్రామాల్లో జనార్థన్ రెడ్డికి మంచి స్పందన వస్తోంది. ధర్మానికి.. అధర్మానికి జరుగుతున్న యుద్ధమని.. ధర్మమే గెలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని మర్రి జనార్థన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-22T13:06:06+05:30 IST