వాలంటీర్లతో జగన్ సర్కార్ ఓట్ల వేట..
ABN, First Publish Date - 2023-11-08T08:46:48+05:30
అమరావతి: జగన్ సర్కార్ వాలంటీర్లతో ఓట్ల వేట సాగిస్తున్నట్లు స్పష్టమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలో నిమగ్నం కావడంతో సందట్లో సడేమియాగా వైసీపీ ప్రభుత్వం ఓటర్ల వివరాలను సేకరించింది.
అమరావతి: జగన్ సర్కార్ వాలంటీర్లతో ఓట్ల వేట సాగిస్తున్నట్లు స్పష్టమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలో నిమగ్నం కావడంతో సందట్లో సడేమియాగా వైసీపీ ప్రభుత్వం ఓటర్ల వివరాలను సేకరించింది. ఇందుకు వాలంటీర్లనే వాడుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేసేది ఎవరు? వైసీపీకి ఎవరు ఓట్లు వేస్తారు? అనే సమాచారాన్ని సేకరించింది. ఎన్నికల ప్రక్రియలో గ్రామ, వార్డు, వాలంటీర్లను వాడుకోకూడదనే నిబంధనలు తుంగలో తొక్కీ ఓటర్ల వివరాలను సేకరించింది. ఇదంతా సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో జరగడం విశేషం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-08T08:47:07+05:30 IST