ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భూ తగాదా.. వ్యక్తికి గాయాలు

ABN, First Publish Date - 2023-12-10T22:53:46+05:30

పొలం పని చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు తమకు చెందిన భూమిని ఆక్రమించుకున్నారంటూ వ్యక్తిపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రావిరాలలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఆదిభట్ల, డిసెంబరు 10 : పొలం పని చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు తమకు చెందిన భూమిని ఆక్రమించుకున్నారంటూ వ్యక్తిపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రావిరాలలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదిభట్ల ఎస్‌ఐ శ్రీనివా్‌సరావు తెలిపిన వివరాల ప్రకారం.. రావిరాలకు చెందిన సన్నిళ్ల యాదమ్మకు కొంగరకుర్ధు రెవెన్యూ పరిధి సర్వేనెంబర్‌ 13, 14లలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అదే గ్రామానికి చెందిన మీగడ రాజు అనే వ్యక్తికి కూడా కొంత భూమి ఉంది. కాగా, వారిద్దరికీ కొంతకాలంగా గట్టు తగాదా నడుస్తోంది. ఇదే విషయమై శనివారం సాయంత్రం ఇరువురి మధ్య గొడవకు దారితీసింది. రాజు కుటుంబ సభ్యులు యాదమ్మ, ఆమె కుమారులు గోవర్ధన్‌రెడ్డి, విష్ణు వర్ధన్‌రెడ్డిలపై దాడికి దిగారు. ఈఘర్షణలో గోవర్ధన్‌ రెడ్డి తలకు గాయమైంది. యాదమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు రాజు కుటుంబ సభ్యులు 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-12-10T22:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising